మెదక్ : ఈటల రాజేందర్ భూముల వ్యవహారంలో మరోసారి అధికారులు చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్టు నోటీసులు ఇచ్చారు. హకీంపేటలోని సర్వే నం-97లో సర్వే చేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న సర్వేకు హాజరు కావాలని తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్ రెడ్డి పేరుతో జమునా హ్యాచరీస్ వద్ద అధికారులు నోటీసులు అంటించారు.