హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): శ్రీవారి జూలై, ఆగస్టు నెలల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 25న తిరుపతిలో గదుల కోటాను, 26న తిరుమలలో గదుల కోటాను రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. దర్శన టికెట్లను http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ నుంచి, యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.