హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను (Arjitha seva tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనుంది. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. వీటితోపాటు ఎలక్ట్రానిక్ డిప్, ప్రత్యేక ప్రవేశ దర్శనం (Electronic dip), వసతి గదుల కోటాకు సంబంధించిన టోకెన్లను వివిధ తేదీల్లో విడుదల చేయనుంది.
ఎలక్ట్రిక్ డిప్: జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషన్ 22న ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్ అలాట్మెంట్ను ప్రకటించనుంది.
ఆర్జిత సేవలు: జూలై మాసానికి సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సహా తదితర ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఉదయం 11.30 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేస్తుంది.
అంగ ప్రదక్షిణం: జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తుంది.
వర్చువల్ సేవలు: మే, జూన్ నెలలకు సంబంధించి వర్చువల్ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం: మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వసతి గదులు: మే నెలకు సంబంధించి తిరుమలలో వసతి గదుల కోటాను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు, 27న తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనుంది.