హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : తిరుమలలోని నూతన పరకామణి మండపంలో ఆదివారం నోట్ల లెకింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకొని బయటకు వెళ్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీ కెమెరాల ద్వారా విజిలెన్స్ అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకొన్నారు. తనిఖీల్లో నోట్లను గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.