హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘విద్యుత్తు బిల్లు పెండింగ్ ఉంటే రాత్రికి కరెంటు కట్చేస్తాం. విద్యుత్తు నిలిలి వేయొద్దంటే బిల్లు చెల్లింపు కోసం అధికారి 96928 48762 నంబర్కు కాల్ చేయగలరు’ అంటూ తప్పుడు మెసేజ్లు పంపి పలువురు మోసాలకు పాల్పడుతున్నట్టు విద్యుత్తు పంపిణీ సంస్థ దృష్టికి వచ్చింది. గతంలో సైతం విద్యుత్తు వాడకం, బిల్లుల చెల్లింపు పేరుతో కొంతమంది.. వినియోగదారులను మెసేజ్లు, ఫోన్ల ద్వారా బెదిరించి బ్యాంకు ఖాతాలు, డెబిట్కార్డు వివరాలు తీసుకొని నగ దు మాయంచేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఒకవేళ ఎవరైనా ఫోన్చేసి, మెసేజ్ ద్వారా విద్యుత్తు బిల్లు పెండింగ్లో ఉన్నదని చెబితే, చెల్లించిన వివరాలను www.tssouthernpower.com, TSSPDCL మొబైల్ యాప్లో సరి చూసుకోవాలని చెప్పారు. రాత్రిపూట విద్యుత్తు సరఫరా నిలిపివేయడమనేది సంస్థ చేయదని స్పష్టంచేశారు.