హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు రెండు ఇండియన్ చాంబర్ అఫ్ కామర్స్ (ఐసీసీ) అవార్డులు దక్కాయి. టెక్నాలజీ అడాప్షన్ విభాగంలో క్యాటగిరీ-డీ లో మొదటి ర్యాంకు అవార్డు, క్యాటగిరీ- ఈ (ప్రతిభ మెరుగుపర్చుకోవడం)లో మూడో ర్యాంకు అవార్డు లభించింది.
ఈ రెండు అవార్డులను ఈ నెల 17, 18న న్యూఢిల్లీలో ఇండియన్ చాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ ఇండియా ఎనర్జీ సమ్మిట్, పదో ఇన్నోవేషన్ విత్ ఇం పాక్ట్ అవార్డ్స్ ఫర్ డిస్కమ్స్ – 2022 కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ఐటీ) టీ శ్రీనివాస్ అందుకొన్నారు. సంస్థ పరిధిలో వాడుతున్న ఉత్తమ ఐటీ సాంకేతికత, పనితీరు మెరుగుదలలో చూపిన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. అవార్డులను సీఎండీ రఘుమారెడ్డికి డైరెక్టర్ శ్రీనివాస్ అందజేశారు.