కవాడిగూడ, ఆగస్టు 13: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై శనివారం ఆర్టీసీ బస్సులతో టీఎస్ఆర్టీసీ పరేడ్ నిర్వహించింది. నిజాం హయాంలో 1932లో వినియోగించిన మొదటి బస్సు అల్ బియన్ బస్సును పరేడ్లో తిప్పారు. అప్పట్లో ఆ బస్సును లండన్ నుంచి తెప్పించారు. పరేడ్లో భాగంగా ట్యాంక్బండ్పై ఉన్న వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. 1940లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేసిన 98 ఏండ్ల టీఎల్ నరసింహన్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం టీఎల్ నరసింహన్ను ఎండీ సజ్జనార్ శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, హెచ్వోడీలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.