VC Sajjanar | హైదరాబాద్ శివారులోని బండ్లగూడ జాగీర్ సమీపంలోని సన్సిటీ వద్ద నిన్న జరిగిన రోడ్డుప్రమాదంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ శివారులోని సన్ సిటీ దగ్గర నిన్న జరిగిన ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం.. మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది అని చెప్పారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పిల్లల మీద అతి ప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి అని సజ్జనార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
బండ్లగూడ జాగీర్ సమీపంలో మంగళవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన తల్లీకూతురు అనురాధ, మమతను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. మాసబ్ట్యాంక్కు చెందిన మహమ్మద్ బద్రుద్దీన్ ఖాదిర్ (19) పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్కు స్నేహితులతో కలిసి బయలు దేరాడు. సన్సిటీ వద్దకు రాగానే కారు అదుపు తప్పి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ శివారులోని సన్ సిటీ దగ్గర నిన్న జరిగిన ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం.. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి… pic.twitter.com/4TgJDxH5Ym
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 5, 2023