VC Sajjanar | హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పార్థివదేహానికి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్తో తనకున్న అనుబంధాన్ని సజ్జనార్ గుర్తు చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఆయన నన్ను కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్తో తనకున్న అనుబంధాన్ని వివరించారని ట్వీట్ చేశారు సజ్జనార్.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారని సజ్జనార్ గుర్తు చేశారు. అంతలోనే గద్దర్ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సజ్జనార్ పేర్కొన్నారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్ను కొల్పోయామని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ గారు నిలిచిపోయారని కొనియాడారు.
గద్దర్తో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉందని సజ్జనార్ గుర్తు చేశారు. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారని సజ్జనార్ గుర్తు చేసుకున్నారు.
ప్రజాస్వామ్యం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యమని గద్దర్ భావించారని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తను మొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారని సజ్జనార్ అన్నారు.
#Hyderabad ఎల్బీస్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ గారి పార్థివ దేహానికి #TSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC ) నివాళులు అర్పించారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి.. ఓదార్చారు.
ఈ సందర్భంగా గద్దర్ గారితో తనకున్న అనుబంధాన్ని సజ్జనర్ గారు గుర్తు… pic.twitter.com/5ckxmzzUEr
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 7, 2023