హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు రుచికరమైన బంగినపల్లి మామిడి పండ్లు ఇంటి వద్దకే చేర్చే ఆఫర్ను ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఇప్పటికే పలురకాల వస్తువుల కార్గో, పార్సిల్ సేవలు తెచ్చిన ఆర్టీసీ ఈ వేసవిలో మామిడిపండ్ల హోం డెలివరీ సేవలను ప్రారంభించింది. కేజీ రూ.115కు తా జా బంగినపల్లి మామిడి పండ్లు రైతుల తోట నుంచి నేరుగా ఇండ్లకు చేర్చనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ప్రకటించారు.
కనీసం 5 కేజీల పార్సిల్ బుక్ చేసుకోవాలని సూచించారు. 5, 10, 15 కిలోలు లేదా టన్ను వరకు కూడా పార్సిల్ బుక్ చేసుకోవచ్చని, బుక్ చేసిన వారం రోజుల్లో పార్సిల్ను ఇంటికి చేర్చుతామని పేర్కొన్నారు. బుకింగ్ కోసం ‘www.tsrtcparcel.in’ వెబ్సైట్లో లేదా ‘www.tsrtconline.in’ లేదా 040-2345003, 040-69440000 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో బంగినపల్లి రకం ఎక్కువగా ఉండటంతో, అక్కడి రైతులతో కలిసి టీఎస్ ఆర్టీసీ మామిడి పండ్లను సరఫరా చేయనుంది.