హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. సాలరీ ఖాతా, రూపేకార్డు ద్వారా రూ.50 లక్షల ఆర్థిక సాయం అందేలా చేసి, కుటుంబానికి భరోసా కల్పించింది. వివరాల్లోకెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును మల్యాల-బల్వంతాపూర్ స్టేజీ వద్ద రాంగ్రూట్లో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ బొల్లం సత్తయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఇంటి పెద్ద దికు మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకొన్నది. సూపర్ సాలరీ సేవిం గ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40 లక్షలు రా గా, రూపే కార్డు కింద మరో రూ.10 లక్షలను యూబీఐ అందజేసింది. మంగళవారం బస్భవన్లో మొత్తం రూ.50 లక్షల విలువైన చెక్కులను సత్తయ్య కుటుంబానికి యూబీఐ అధికారులతో కలిసి ఎండీ సజ్జనార్ అందజేశారు. రూ.50 లక్షల ఆర్థికసాయం అందించడంపై సత్తయ్య భార్య పుష్పతోపాటు కుమారుడు ప్రవీణ్కుమార్, కూతురు మాధవీలత సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఈడీలు కృష్ణకాంత్, వినోద్కుమార్, యూబీఐ జనరల్ మేనేజర్ పీ క్రిష్ణన్ పాల్గొన్నారు.