హైదరాబాద్: నిధుల సమీకరించుకునేందుకు భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో సంస్థకు ఉన్న భూముల్లో 13.16 ఎకరాల లీజు ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో కాచీగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్లో 2.83 ఎకరాలు, శామీర్పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు ఉన్నాయి. ఆన్లైన్లో టెండరు దరఖాస్తులను ఆహ్వానించింది. జనవరి 18 వరకు టెండర్లు దాఖలు చేయవచ్చు. ఆసక్తి కలిగినవారు పూర్తి వివరాల కోసం https://www.tsrtc.telangana.gov.in/ వెబ్సైట్ చూడవచ్చు.
కాగా, అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేదర్ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన బస్సులను ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి.