హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. గత జనవరిలో 14,182 మంది శ్రీవారిని దర్శించుకొన్నారు.
తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జూలైలో ‘బాలాజీ దర్శన్’ను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల వెళ్లేందుకు బస్ టికెట్తోపాటే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్ను బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించింది. అందుకోసం టీటీడీతో టీఎస్ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నది.