హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : అరుణాచలంను దర్శించుకొనే భక్తులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ఈ నెల 25 నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ నుంచి అరుణాచలంకు బయలుదేరిన బస్సులు.. అదేరోజు సాయంత్రం తిరుగుపయనమవుతాయని వివరించారు. ఒక్కో సీటుకు రూ.3,690 టికెట్ చార్జీ చెల్లించాలని పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ కౌంటర్లలో లేదా సంస్థ వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9959226257, 9959224911, 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని కోరారు.