హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ప్రవేశాలకు ఆదివారం టీఎస్ఆర్జేసీ పరీక్ష నిర్వహించనున్నట్టు గురుకులాల సెక్రటరీ రమణకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షకు ఈ సారి 73,527 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపారు. హాల్టికెట్లను www.tsrjdc.cgg.gov. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.