TSPSC | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో నిన్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు గ్రూప్-1కు దరఖాస్తు చేయకున్నా.. వారికి హాల్టికెట్లు ఇచ్చారన్న వార్తలపై టీఎస్పీఎస్సీ వివరణ ఇచ్చింది.
గ్రూప్-1కు దరఖాస్తు చేయకున్నా హాల్ టికెట్ ఇచ్చారనడం తప్పు అని స్పష్టం చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి జక్కుల సుచిత్ర గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నారు. సుచిత్ర గతేడాది అక్టోబర్లోనూ గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశారు. గ్రూప్-3, 4 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తే గ్రూప్-1 హాల్ టికెట్ ఇచ్చారనడం అబద్ధం అని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
గతేడాది అక్టోబర్ 16వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీకి సుచరిత హాజరయ్యారు. నిజామాబాద్లోని ఆర్పీ రోడ్డులోని ఏహెచ్ఎంవీ జూనియర్ కాలేజీలో ఆమెకు సెంటర్ పడింది. ఆమె పరీక్షకు హాజరై నామినల్ రోల్లో కూడా సంతకం చేశారని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.