నాంపల్లి కోర్టులు, మే 19 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ కస్టడీ ముగియడంతో నిందితులను జువెనైల్ కోర్టు మెజిస్ట్రేట్ జీ రాధిక జ్యుడీషియల్ కస్టడీకి విధించారు. నిందితులు కాంతం మురళీధర్రెడ్డి, ఆకుల మనోజ్కుమార్, ఆదిసాయిబాబు, పొన్నం వరుణ్కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్ నాలుగు రోజుల కస్టడీ పూర్తి కావడంతో శుక్రవారం సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.
అజ్మీరా పృథ్వీ, రాజేశ్వర్ జాదవ్నూ 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నూతన్ రాహుల్, సుచరితరెడ్డి బెయిల్ పిటిషన్లపై కౌంటర్ వేయనున్నట్టు సిట్ పీపీ కోర్టుకు తెలిపారు. నూతన్ రాహుల్పై నమోదైన సెక్షన్లకు, కేసుకు పొంతనలేదని, విద్యార్థి జీవితం నాశనం అవుతుందని వాదించారు. సాయిలౌకిక్, సుస్మిత దంపతుల తరఫున శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్కు దరఖాస్తు చేశారు.