నాంపల్లి కోర్టులు, జూన్ 14 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య తీర్పు చెప్పారు. మరో నిందితుడు భూక్యా మహేశ్ బెయిల్ను సైతం కొట్టివేశారు. 11 మంది నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. నూతన్ కుమార్, రవితేజ తరఫున న్యాయవాదులు వాదనలు పూర్తి చేయగా, తీర్పును గురువారానికి వాయిదా వేశారు. నిందితుడు మహ్మద్ ఖాలీద్ను 5 రోజుల కస్టడీ ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ ఇవ్వొద్దని న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.