హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీల్లో మహిళా సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు మంగళవారం టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
పోస్టుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రకటించారు. 12 సెప్టెంబర్ 2022లో మొత్తం 837 పోస్టులతో నోటిఫికేషన్ జారీ అయ్యింది.