హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్ 1 పరీక్షకు బుధవారం నాటికి 1, 45, 166 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 3,75, 832కు చేరుకొన్నదని చెప్పారు. కొత్తగా 1,21,171 ఓటీఆర్లు నమోదయ్యాయి. 2, 54,661 మంది అభ్యర్థులు ఓటీఆర్ను ఎడిట్ చేసుకొన్నట్టు అధికారులు వెల్లడించారు.