TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్( Special Investigation Team ) కు బదిలీ చేసింది. ఈ కేసును సిట్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్( CP CV Anand ) ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్( Addl CP AR Srinivas ) ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగనుంది. ఇప్పటి వరకు ఈ కేసును బేగంబజార్ పోలీసులు( Begum Bazar Police ) దర్యాప్తు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్( Asst Engineer ) ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి నిందితులపై 409, 420, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు( Nampally Court ). ఏ3 రేణుకను చంచల్గూడ( Chanchalguda ) మహిళా జైలుకు తరలించారు. మిగతా 8 మందిని చంచల్గూడ జైలుకు తరలించారు.
ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ రాతపరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని సమాచారం అందడంతో.. టీఎస్పీఎస్సీ( TSPSC ) అధికారులు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న జరగాల్సిన టీపీబీవో, 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. ఏఈ పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్డీఏలో టెక్నికల్ అసిస్టెంట్ ఢాక్య, కానిస్టేబుల్ శ్రీనివాస్తో పాటు మరో నలుగురిని రిమాండ్కు తరలించారు.