హైదరాబాద్: తెలంగాణలో పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 1న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్లో జరుగుతుందని, అక్టోబరు 4 నుంచి 18 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్లో మొత్తం 83 కాలేజీల్లో 6,437 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి.
ఎంఫార్మసీలో మొత్తం 101 కాలేజీల్లో 3,593 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఫార్మ్డీలో 25 కాలేజీల్లో 250 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎం.ఆర్క్లో 7 కాలేజీలకుగాను 200 సీట్లు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పీజీఈసెట్, గేట్లో 17,628 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే.