హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీ, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టనున్నట్టు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.
శుక్రవారం టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీకి ఈ నెల 17 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు నోటీసు అందజేసింది. సమ్మె నోటీ సు ఇచ్చిన వారిలో జేఎసీ నేతలు సాయిబాబు, రత్నాకర్రావు, శ్రీధర్, బీసీ రెడ్డి తదితరులు ఉన్నారు.