హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): బోయినపల్లిలో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న బయో ఎనర్జీ ప్లాంట్ను తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీఆర్ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు సోమవారం సందర్శించారు. మార్కెట్ యార్డు నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తిచేసేందుకు ఐఐసీటీ సహకారంతో నెలకొల్పిన ఈ ప్లాంట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి వినియోగదారుల సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేశారు.