హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్బీసీఎల్) బోర్డు మీటింగ్లో వార్షిక ఆదాయ నివేదికలకు ఆమోదం లభించింది. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను తక్షణం అమలు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్టు టీఎస్బీసీఎల్ చైర్మన్ గజ్జెల నగేశ్ తెలిపారు. సోమవారం సెక్రటేరియట్లో చైర్మన్ ఆధ్యక్షతన బోర్డు మీటింగ్ నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆ శాఖ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, హరిత, ఎం రామసింగారు, జీఎం అబ్రహం, ఓఎస్డీ సంతోష్రెడ్డి పాల్గొన్నారు.