TS Weather | తెలంగాణలో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయని.. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో వైపు రాష్ట్రంలో పగటిపూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అదే సమయంలో రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రిళ్లు చలితో జనం వణికిపోతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.