Telangana | హైదరాబాద్ : విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు లేవని టీఎస్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో పాటు కొంత మంది వ్యక్తులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని, అలాంటి ప్రకటనలు ఫేక్ అని పేర్కొన్నారు.
ఇటీవల తన పేరుతో మణుగూరులో ఓ వ్యక్తి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఈ నకిలీ అపాయింట్మెంట్స్పై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందన్నారు. ఎవరైనా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాలని సూచించారు. అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ ఉద్యోగం అయినా పరీక్షలు, అర్హతలు, ఇంటర్వ్యూల ఆధారంగానే వస్తాయని సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.