హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పేపర్ -2లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. పేపర్1లో కూడా ఇదే మాదిరిగా ఉత్తీర్ణత శాతం రికార్డయింది. ఇలా జరగడం టెట్ చరిత్రలోనే తొలిసారి. పేపర్ -2లో కేవలం 15.30 శాతం అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై కాగా, పేపర్1లో కాస్త ఆశాజనకంగా 36.89శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షను ఈ నెల 15న నిర్వహించారు. ఆయా ఫలితాలను ఎస్సీఈఆర్టీ అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు.
ఇదివరకు 2017లో పేపర్2లో 19.51 ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, ఈసారి ఏకంగా నాలుగు శాతం తగ్గి 15.30 శాతానికే పరిమితమైంది. 2022లో 32.68శాతం తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైతే ఈ సారి 36.89 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పేపర్ -2 సోషల్ స్టడీస్లో 11.47శాతం అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గణితం, సైన్స్ పేపర్లోనూ ఇదే తరహాలో 18.66శాతం అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. పేపర్ -1లో 133 మార్కులతో సతీశ్కుమార్ టాపర్గా నిలువగా, పేపర్ -2లో 126 మా ర్కులతో బల్లె సుమన టాప్ స్కోరర్గా నిలిచింది. టెట్ ప్రశ్నపత్రాల్లో పలు తప్పులుండటంతో అభ్యర్థులకు మార్కులు కలిపారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు రాగా, వీటిని పరిశీలించిన నిపుణుల కమిటీ ఫైనల్ కీ లో వారికి అదనపు మార్కు లు కేటాయించింది.