TS TET 2023 | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఎప్పుడూ కఠినంగా వచ్చే పేపర్-1 ప్రశ్నాపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్-2 మాత్రం కఠినంగా ఇచ్చారు. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి.
అభ్యర్థుల్లో లోతైన విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేలా ప్రశ్నపత్రం రూపొందించారని నిపుణుల అంచనా. ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా, సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు కొన్నిచోట్ల ఒక పేపర్కు బదులు మరో పేపర్.. ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి ఓఎమ్మార్ను పంపిణీ చేయడం, ఆ తర్వాత తప్పిదాలు జరిగినట్టుగా గుర్తించడంతో వైట్నర్తో చెరిపివేశారు. వైట్నర్ వాడిన ఓఎమ్మార్ షీట్లు చెల్లుబాటవుతాయని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
టెట్ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్సైట్లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి ప్రకారం తుది కీ ప్రకటిస్తారు. అయితే అక్కడక్కడ ఓఎమ్మార్ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి.
caption id=”attachment_1253774″ align=”alignnone” width=”785″]