హైదరాబాద్, మార్చి 25 (నమస్తేతెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అందుకు 178 ఎకరాల విస్తీర్ణంలో కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మండీ చైర్మన్ అదిల్ఖాన్ ఆహ్వానం మేరకు శుక్రవారం దేశంలో అతిపెద్ద ఢిల్లీ ఆజాద్పూర్ మండీని మంత్రి నిరంజన్రెడ్డి, మార్కెటింగ్శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి సందర్శించారు. పండ్లు, కూరగాయలు, పసుపు మార్కెటింగ్ విధానాన్ని పరిశీలించారు. 1995లో 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆజాద్పూర్ మండీలో ఏడాదికి రూ.100 కోట్ల వ్యాపారం నడుస్తున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోహెడలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నదని, కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం సుస్థిరం అవుతున్నదని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.