హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కు సంబంధించి ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా షెడ్యూల్ను ప్రకటించింది. పది పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగనున్నాయి
ఏప్రిల్ 3 – ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 – సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 – థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
ఏప్రిల్ 8 – గణితం
ఏప్రిల్ 10 – సామాన్య శాస్త్రం(ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 11- సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 12 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
ఏప్రిల్ 13 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం నుంచి 11 పేపర్లను కుదించి, 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కుల్ని ఫార్మెటివ్ అసెసెమెంట్కు ఇచ్చారు. 9వ తరగతి విద్యార్థులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 33 జారీ చేశారు. ఇదివరకు వ్యాసరూప, సూక్ష్మరూప ప్రశ్నలు రెండింటిలోనూ విద్యార్థులకు చాయిస్ ఇచ్చేవారు. కానీఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల్లోనే చాయిస్ ఉంటుంది. సూక్ష్మ రూప ప్రశ్నలకు చాయిస్ వర్తించదు.