TS RTC | ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు పల్లెల్లో బస్ ఆఫీసర్ల నియమించాలని నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూ.. ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేసేందుకు విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థకు రూప కల్పన చేసింది. ఈ మేరకు బస్ ఆఫీసర్ల నియామకంతో విధి విధానాలకు సంబంధించి మార్గదర్శకాలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ జారీ చేశారు. బస్ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆఫీసర్ల వ్యవస్థ మే ఒకటో తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఆర్టీ 10వేల గ్రామాలకు బస్సులు నడిపిస్తున్నది. ఆయా ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో 2వేలకుపైగా వీలేజీ బస్ ఆఫీసర్ల నియమించాలని నిర్ణయించింది. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ఆదరిస్తున్నారని, ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను వినియోగించుకుని ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.