TS RJC CET 2024 | పదో తరగతి విద్యార్థులకు గమనిక. సాంఘిక సంక్షేమ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పరీక్ష కోసం ఇవాళ (జనవరి 31వ తేదీ ) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలయ్యింది. అర్హులైన విద్యార్థులు రూ.200 దరఖాస్తు రుసుముతో మార్చి 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. మే నెలలో తొలి కౌన్సెలింగ్ నిర్వహించి.. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో భర్తీ చేస్తారు.