వేములవాడ: ‘చేతులు ఎత్తి మొక్కుతాం.. మీరు బయటకు రావొద్దు’ అంటూ వేములవాడలో ఓ హెడ్కానిస్టేబుల్ ప్రజలకు దండం పెట్టి మరీ వేడుకుంటున్నారు. కరోనా పరిస్థితులు తీవ్రరూపం దాల్చినందున రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయట తిరగవద్దని అటుగా వచ్చిన వాహనదారులకు హెడ్కానిస్టేబుల్ దేవేందర్రెడ్డి నమస్కరించి చెప్పారు. కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆయన.. అత్యవసర పరిస్థితుల్లో తాము విధులు నిర్వహిస్తున్నామని, దయచేసి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చేతులెత్తి మొక్కి వేడుకున్నారు.