చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 25: మోటర్ల కు మీటర్లు బిగిస్తానన్న బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మం డలం దండుమల్కాపూర్లో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసన్నారు. 24 గంటల ఉచిత కరెంటు కావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని, 6 గంటల కరెంటు కావాలంటే బీజేపీకి వేయాలని చెప్పారు.
ఈ ఉపఎన్నిక ప్రధాని మోదీ, కేసీఆర్కు మధ్య జరుగుతున్నదని చెప్పారు. మోటర్లకు మీటర్లు పెడితే ఏమవుతుందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. వంట గ్యాస్ 400 నుంచి 1,200 చేసినందుకు మోదీకి ఓటెయ్యాలా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచింది కేంద్రంలోని బీజేపీ సర్కారు కాదా? అని నిలదీశారు. కూసుకుంట్ల గెలిచిన రెండు నెలల్లోనే డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఎవరు ఎన్ని గిమ్మిక్కులు చేసినా నమ్మి మోసపోవద్దన్నారు.