హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): గుండెపోటుకు గురైనవారికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలుపుతున్నవారు కనిపించే దేవుళ్లు అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. తాజాగా హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలు వెలుగు చూశా యి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు శుక్రవారం స్పందిస్తూ.. వారిని రియల్ హీరోలుగా అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండ లం చిన్నకిష్టాపూర్కు చెందిన రాజు అనే యువకుడికి గుండెపోటు రాగా, 108 సిబ్బంది బైండ్ల మహేందర్ ఆ యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపారు. మరో ఘటనలో హైదరాబాద్ హయత్నగర్లో ఓ వ్యక్తి కారు నడుపుతూ గుండెపోటుకు గురయ్యారు. అక్కడే ఉన్న రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మోతిరాం వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. ‘అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు’ అని మంత్రి హరీశ్రావు శుక్రవారం ట్వీట్ చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెడుతున్న వారందరూ కనిపించే దేవుళ్లు అని ప్రశంసించారు.