TS Inter | ఇంటర్మీడియ్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఇంటర్ ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 30 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పింది. ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులకు మించరాదని, ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించొద్దని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.