TS Inter Exams | హైదరాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ప్రధాన పరీక్షలు మార్చి 16తోనే ముగుస్తాయి. బ్రిడ్జికోర్సు విద్యార్థులకు మార్చి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఒకట్రెండు రోజుల్లో ఇంటర్బోర్డు విడుదల చేయనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక రోజు ఫస్టియర్ వారికి, మరోరోజు సెకండియర్ వారికి పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఏడాది తొలిసారి ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ పేపర్ను 80 మార్కులకే కుదించారు. వార్షిక పరీక్షలు సహా ప్రాక్టికల్స్ పరీక్షలు, ఇంటర్నల్స్తో కూడిన పూర్తి షెడ్యూల్ను ఒకట్రెండురోజుల్లోనే అధికారులు విడదల చేయనున్నారు.
మార్చి 18నుంచి పది పరీక్షలు..!
ఇంటర్ పరీక్షలపై స్పష్టతరావడంతో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్పైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజా సమచారం ప్రకారం మార్చి 18 నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి. మొత్తం ఏడు రోజుల పాటు పరీక్షలను నిర్వహించనుండగా, మార్చి నాలుగు వారంలో పరీక్షలు ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను ఎస్సెస్సీ బోర్డు రూపొందించే పనిలోపడింది. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాతే పదో తరగతి పరీక్షలను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. తాజాగా ఇంటర్ షెడ్యూల్ ఖరారుకావడంతో ఎస్సెస్సీబోర్డు అధికారులను ఆరా తీయగా, మార్చి మూడోవారంలో పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలిపారు.