TS ICET | హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన ఐసెట్ ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ ద్వారా సమర్పించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు జూన్ 5వ తేదీ నుంచి క్వశ్చన్ పేపర్లు, రెస్సాన్స్ షీట్లను వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐసెట్ ఫలితాలను జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నారు.
మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలను నిర్వహించగా 75,925 మంది విద్యార్థులకు గానూ 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైన విషయం విదితమే. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ వెబ్సైట్ ద్వారా convener.icet@tsche.ac.in సమర్పించాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ పేర్, రెస్సాన్స్ షీట్లను icet.tsche.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.