హైదరాబాద్ : అనారోగ్యం తో తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి చందూలాల్ మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్ర సంతాపం ప్రకటించారు. చందూలాల్ గిరిజన హక్కుల సాధనకు, బీద, బడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడని ఈ సందర్భంగా హోం మంత్రి పేర్కొన్నారు. మంత్రి పదవులతో పాటు వివిధ పదవులు నిర్వహించిన చందూలాల్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేసేవారన్నారు. అయన జీవితమే స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక మంచి నాయకుడినే కాకుండా, గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.