హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7,180 మంది సిబ్బందిని, కొవిడ్ సేవల కోసం 1,191 వైద్య సిబ్బంది సేవలను ఏడాది కాలం పాటు పొడిగించింది. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.