LRS | లే అవుట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. మిగిలిపోయిన మిగతా వారి కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకుమార్చి 31 వరకు వీలు కల్పించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర అవుట్స్ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల మంది దరఖాస్తుదారులకు లాభం చేకూరనున్నది.