హైదరాబాద్ : బంజారాహిల్స్లోని డీఏవీ పాఠశాల అనుమతిని రాష్ట్ర విద్యాశాఖ పునరుద్ధరించింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని విద్యాశాఖ ఇచ్చింది. ఆ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో ఆ స్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాల గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖకు విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలను కొనసాగించవచ్చని విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు.