హైదరాబాద్ : టీఎస్ ఫుడ్స్లో పనిచేస్తున్న రెగ్యులర్, క్యాజువల్ ఎంప్లాయిస్కు చెందిన అన్ని అలవెన్స్లను 20 శాతం పెంచుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. అలవెన్సులను పెంచుతూ నిర్ణయించిన సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్కు మేడె రాజీవ్ సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎండబ్ల్యూలో పనిచేస్తున్న ఉద్యోగులు, రెగ్యులర్ ఎంప్లాయిస్గా పనిచేసిన ఉద్యోగులు చనిపోతే వారి పిల్లలకు ఉద్యోగ భద్రత ఇచ్చేందుకు సైతం ఈసీ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందని మేడె రాజీవ్ సాగర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ల జనరల్ మేనేజర్లు, హెచ్ఎంఎస్ యూనియన్, ఐఎన్టీసీ యూనియన్, సిఐటియు యూనియన్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ సెల్ అసోసియేషన్ లకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు, సెక్రటరీలు ఉద్యోగస్తులందరూ పాల్గొన్నారు.