హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకోసం గురువారం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ పరీక్షకు ఏమాత్రం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనర్ రామకృష్ణ, కో కన్వీనర్ పీ శంకర్ తెలిపారు. ఏపీ, తెలంగాణలోని 49 కేంద్రాల్లో మూడు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షకు 31,725 మంది అభ్యర్థులు హాజరవుతారని వెల్లడించారు. ప్రతి పరీక్షాకేంద్రం వద్ద అబ్జర్వర్ను నియమిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు కొవిడ్ -19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు.