TS ECET | హైదరాబాద్ : పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీతారాం వెంకటేశ్ వెల్లడించారు.
ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 16. ఆలస్య రుసుం రూ. 500తో ఏప్రిల్ 22 వరకు, రూ. 1000తో ఏప్రిల్ 28వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించొచ్చు. ఏప్రిల్ 24 నుంచి 28వ తేదీ మధ్యలో అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు.