హైదరాబాద్ : టీఎస్ ఈసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను గురువారం విడుదల చేశారు. సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. 9వ తేదీ నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.
సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సెప్టెంబర్ 17న ఈసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు జరగనుంది. మొదటి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 22వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 29న సీట్లు కేటాయించనున్నారు. అక్టోబర్ 10వ తేదీ లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.