హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. రెండు విడతల్లో నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ శనివారం విడుదల చేశారు. గతనెల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 94,476 విద్యార్థులకు, 71,180 మంది క్వాలిఫై అయ్యారు. గతేడాది 126 కాలేజీల్లో 13,780 సీట్లు ఉండగా, ఈ ఏడాది దాదాపు అవే సీట్లు ఉండనున్నాయి. బయోటెక్నాలజీ హైదరాబాద్ సీబీఐటీలో 21 సీట్లు ఉన్నాయి. బయోటెక్నాలజీ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా, ఫార్మసీ సీట్లకు కూడా అదేస్థాయిలో ఉన్నది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం నవంబర్ 23న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని నవీన్మిట్టల్ తెలిపారు.