హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఉదయం 11:45 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎంసెట్ ఫలితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించొచ్చు.
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరక్షీలను జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడుతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు జులై 30, 31 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.