TS EAMCET | హైదరాబాద్ : మే 25వ తేదీన టీఎస్ ఎంసెట్ – 2023 ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటన చేశారు. 25వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారని తెలిపారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్లో ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేయనున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇక మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు. ఎంసెట్ ఫలితాల కోసం www.ntnews.com, eamcet.tsche.ac.in అనే వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు.